

మోసాల కట్టడికి 1600 సిరీస్ ఫోన్ నంబర్లు
మోసపూరిత ఫోన్ కాల్స్ ద్వారా జరుగుతున్న ఆర్థిక నేరాలను అరికట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ, సెబీ, పీఎఫ్ఆర్డీఏ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా (BFSI) కంపెనీలు తమ కస్టమర్లకు చేసే సేవా కాల్స్, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ కోసం తప్పనిసరిగా 1600 సిరీస్ ఫోన్ నంబర్లు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు మరియు ఎన్బీఎఫ్సీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు ఈ నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలు చేయాలి. వాయిస్ కాల్స్ ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలను తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం. దీంతో కస్టమర్లు నిజమైన కాల్, మోసపూరిత కాల్ ఏదో సులభంగా గుర్తించే అవకాశం పెరుగుతుంది.
బీమా రంగానికి సంబంధించి ఐఆర్డీఏతో జరుగుతున్న చర్చలు పూర్తయ్యాక ఈ నిబంధన బీమా కంపెనీలకు కూడా వర్తించనుంది.
మ్యూచువల్ ఫండ్ సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి. క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లకు 2026 మార్చి 15 నుంచి. ఆర్బీఐ నియంత్రణలోకి వచ్చే పెద్ద NBFCలు, పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFB) వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 లోగా. ఇతర NBFCలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు ఇతర చిన్న సంస్థలు 2026 మార్చి 1 నుంచి. కేంద్రీయ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, పెన్షన్ ఫండ్ మేనేజర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 లోగా.
















కామెంట్స్ (1)
మోసాలను తగ్గించే ప్రభావవంతమైన చర్య