

ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్, తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) 2025–26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బలమైన ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 2.5 రెట్లు పెరిగి రూ.1,290 కోట్లకు పైగా చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.504 కోట్లుగా ఉంది. విద్యుత్ ఉపకరణాల విభాగం బలమైన ప్రదర్శనతో ఈ వృద్ధికి ప్రధాన కారణమైంది. కంపెనీ షేరుకు రూ.1.40 తుది డివిడెండ్ ప్రకటించింది.
మొత్తం ఆదాయం రూ.9,143 కోట్ల నుంచి రూ.12,554 కోట్లకు పెరిగింది. ఇందులో విద్యుత్ విభాగ టర్నోవర్ రూ.9,510 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇది రూ.6,192 కోట్లుగా ఉంది.
మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో బీహెచ్ఈఎల్ నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ.1,600 కోట్లకు పైగా చేరింది. గత ఏడాది ఇది రూ.534 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.28,805 కోట్ల నుంచి రూ.34,590 కోట్లకు పెరిగింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!