

అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఇగ్నైట్టెక్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఎరిక్ వాఘన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంస్థలో ఏఐ వినియోగాన్ని అంగీకరించని ఉద్యోగులను తొలగించి, దాదాపు 80 శాతం మంది సిబ్బందిని కొత్త ఉద్యోగులతో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. వ్యాపార రంగాన్ని జనరేటివ్ ఏఐ పూర్తిగా మార్చేస్తుందనే నమ్మకంతో సంస్థను 2023లో ఏఐ ఆధారిత విధానంలోకి మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ మార్పులో భాగంగా ప్రతి వారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉద్యోగులకు ఏఐ సాధనాలపై శిక్షణ అందించారు. ఇందుకోసం సంస్థ తన మొత్తం వేతన వ్యయంలో దాదాపు 20 శాతం వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు ఈ మార్పును అంగీకరించకపోవడంతో 2023 నుంచి 2024 తొలి త్రైమాసికం మధ్య వందలాది మందిని తొలగించి కొత్త వారిని నియమించాల్సి వచ్చిందన్నారు. కొత్త నైపుణ్యాలు నేర్పడం కంటే మనస్తత్వాన్ని మార్చడం కష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!