

రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ మోటార్సైకిళ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ విశాఖపట్నంలో రూ.1,08,010 కోట్లతో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ నిర్మించనుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కడప జిల్లాలో రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.2,00,964.10 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపగా, వీటి ద్వారా 38,722 మందికి ఉపాధి లభించనుంది.
ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొన్న ఎన్. చంద్రబాబు నాయుడు ప్రతి పెట్టుబడి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, ప్రతి ఒప్పందం భూమిపై అమలయ్యే ప్రాజెక్టుగా రూపాంతరం చెందాలని అధికారులకు సూచించారు. పెట్టుబడుల అనుమతుల నుంచి ప్రారంభోత్సవం వరకు ఎక్కడా జాప్యం ఉండకూడదన్నారు. భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేసి ఆయిల్పాం, మామిడి, కొబ్బరి, కోకో వంటి పంటలకు విలువ జోడించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం అందేలా చూడాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!