ద్విచక్ర వాహన రైడింగ్ సేవలతో ప్రసిద్ధి చెందిన ర్యాపిడో ఇప్పుడు ఆహార డెలివరీ రంగంలోకి ప్రవేశించింది. ఈ సేవల కోసం ‘ఓన్లీ’ అనే ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. రెస్టారెంట్లపై ఎలాంటి కమీషన్ విధించబోమని కంపెనీ స్పష్టం చేసింది. అయితే డెలివరీ నిర్వహణ ఖర్చుల కోసం వినియోగదారుల నుంచి రవాణా రుసుము వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.
ధరలు మరియు ఛార్జీల విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని సంస్థ పేర్కొంది. ప్లాట్ఫామ్ ఫీజులు లేదా మెనూ ధరలను కృత్రిమంగా పెంచడం వంటి విధానాలు ఉండవని, వినియోగదారులు ఆర్డర్ చేసిన ఆహారం మరియు డెలివరీ చార్జీలకే పరిమితంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రారంభ దశలో ఈ సేవలను బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!