

భారత మీడియా-వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ‘ఫిక్కీ-ఈవై మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రిపోర్ట్ 2026’ ప్రకారం, ఈ రంగం విలువ 2025 నాటికి రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9% వృద్ధి. రాబోయే సంవత్సరాల్లో 7% వార్షిక వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ రంగం రూ.3.3 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశముందని నివేదిక వెల్లడించింది.
డిజిటల్ మీడియా ఈ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మొదటిసారిగా ఇది రూ.లక్ష కోట్ల మార్క్ను దాటింది. డిజిటల్ ప్రకటనలు 26% వృద్ధితో రూ.94,700 కోట్లకు చేరగా, ఇ-కామర్స్ ప్రకటనలు 50% పెరిగి రూ.22,000 కోట్లకు చేరాయి. డిజిటల్ సబ్స్క్రిప్షన్లు 60% వృద్ధితో రూ.16,300 కోట్లుగా నమోదయ్యాయి. పెయిడ్ వీడియో వినియోగదారులు 21.6 కోట్లకు చేరగా, మ్యూజిక్ సబ్స్క్రైబర్లు కూడా గణనీయంగా పెరిగారు.
సినీ రంగం కూడా మంచి వృద్ధిని సాధించింది. గత ఏడాది 1900కు పైగా సినిమాలు విడుదల కాగా, 37 సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మొత్తం సినిమా ఆదాయం రూ.20,500 కోట్లుగా నమోదైంది. టెలివిజన్ వీక్షకులు 74.5 కోట్లకు చేరగా, లైవ్ ఈవెంట్లు 44% వృద్ధి సాధించాయి. అయితే టీవీ ప్రకటనలు, రేడియో మరియు గేమింగ్ రంగాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.
-1774425417157.webp&w=3840&q=75)




.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)









.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!