
.jpg&w=3840&q=75)
ఏప్రిల్ 11 నుంచి ఈక్విటీలు మరియు ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో నానోసెకండ్ స్థాయి ట్రేడింగ్ను ప్రారంభించనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ & సీఈఓ ఆశిష్ చౌహాన్ తెలిపారు. ఈ నిర్ణయంతో భారతీయ మార్కెట్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ట్రేడింగ్ వేదికలకంటే దాదాపు 1000 రెట్లు అధిక వేగంతో పనిచేసే స్థాయికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.
కరెన్సీ డెరివేటివ్ విభాగంలో ఇప్పటికే నానోసెకండ్ వేగంతో ట్రేడింగ్ కొనసాగుతోందని, ఇప్పుడు అదే సాంకేతికతను ఈక్విటీలు మరియు ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లోనూ అమలు చేయనున్నట్లు చెప్పారు.
ఒక సెకను అంటే 100 కోట్ల నానోసెకన్లకు సమానం. ఈ అప్గ్రేడ్తో ఎన్ఎస్ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సెకనుకు 10 కోట్ల లావాదేవీల వరకు పెంచనుంది. ప్రస్తుతం ఎక్స్ఛేంజ్ సెకనుకు సుమారు 50 నుంచి 60 లక్షల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!