
.jpg&w=3840&q=75)
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్) షేరు ట్రేడింగ్ను గమనిస్తున్న పెట్టుబడిదారులకు శుక్రవారం ఉదయం ఒక్కసారిగా పెద్ద షాక్ తగిలినట్టైంది. గురువారం రోజున ఈ షేరు రూ.10,989 వద్ద ముగియగా, శుక్రవారం ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కేవలం రూ.2,230 వద్ద ప్రారంభమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే ఇది నిజమైన పతనం కాదు. ఎంసీఎక్స్ కంపెనీ తీసుకున్న 1:5 స్టాక్ స్ప్లిట్ నిర్ణయం జనవరి 2 నుంచి అమల్లోకి రావడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్క షేరును, రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించారు.
దీని ప్రకారం, జనవరి 1న రూ.10,989 వద్ద ఉన్న ఒక్క షేరు, ఐదు భాగాలుగా విడిపోయిన తర్వాత ఒక్కో షేరు ధర సుమారు రూ.2,230 గా ట్రేడింగ్ను ప్రారంభించింది. అంటే మొత్తం విలువను చూస్తే, షేరు ధర దాదాపు రూ.11,150 (5 × 2,230) వద్ద ప్రారంభమైనట్లే అవుతుంది.
ట్రేడింగ్ సమయంలో ఒక దశలో షేరు సుమారు 4 శాతం పెరిగి, 52 వారాల గరిష్ఠమైన రూ.2,278ను కూడా తాకింది. చివరికి రూ.2,219 వద్ద ముగిసింది. మొత్తం విలువను పరిగణనలోకి తీసుకుంటే, ఇది సుమారు రూ.11,095కి సమానం. అంటే రోజు ముగిసే సమయానికి కూడా ఎంసీఎక్స్ షేరుకు లాభమే నమోదైంది.









.jpg&w=3840&q=75)








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!