
బిజినెస్

భారతదేశంలో రిటైల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం గత ఏడాది నాటికి సుమారు 90 లక్షల కోట్ల నుంచి 95 లక్షల కోట్ల మధ్య ఉన్న ఈ రంగం, 2035 నాటికి 210 లక్షల కోట్ల నుంచి 215 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఇది రాబోయే పదేళ్లలో ఈ రంగం రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతుందని సూచిస్తోంది.
ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ఈ స్థాయి వృద్ధి చాలా అరుదుగా కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యానికి ఇది దోహదం చేస్తుంది. అయితే రిటైల్ వ్యాపార సంస్థలు సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన అమలు, ముఖ్య అంశాలపై స్పష్టమైన దృష్టి పెట్టినప్పుడే ఈ వృద్ధిని సాధించగలవని నివేదిక స్పష్టం చేసింది.







.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!