

ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఓజ్రిట్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ కొత్త లోగోను ఆవిష్కరించిన ఆయన, సంస్థ వ్యవస్థాపకులు భరత్ గుప్తా, వివేకానంద రెడ్డి మరియు నాయకత్వ బృందంతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణను దేశంలోనే ప్రముఖ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ దార్శనికత తమకు స్ఫూర్తిగా నిలిచిందని సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో 1,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, టైర్-2 నగరాలకు కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో సేవలందిస్తున్న ఓజ్రిట్, తెలంగాణ ఐటీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి మరింత సహకారం అందించనున్నట్లు పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!