

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా గత కొన్ని సెషన్ల లాంటే నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే సేషన్లో కొంత సమయం తర్వాత సూచీలు కోలుకున్నాయి. అంతర్జాతీయంగా అనుకూల సంకేతాలు ఉండటం, కనిష్ట స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేయడంపై ఆసక్తి చూపడం వల్ల సూచీలు భారీ నష్టాల నుంచి బయటకు వచ్చాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
గత సెషన్ ముగింపు 83,627 పాయింట్లతో పోలిస్తే, బుధవారం ఉదయం సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత మరో 100 పాయింట్లు కిందకి దిగినప్పటికీ కొంత కోలుకోవడంతో, ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 83,471 వద్ద 190 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ ట్రెండ్ను అనుసరిస్తూ 25,660 వద్ద 60 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.
సెన్సెక్స్లో హిందుస్థాన్ జింక్, వేదాంత, ఆయిల్ ఇండియా, లార్స్ ల్యాబ్స్, నాల్కో వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా, కళ్యాణ్ జ్యువెలర్స్, టాటా ఎలాక్సీ, ప్రెస్టీజ్ ఎస్టేట్, పాలీక్యాబ్ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 164 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 164 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. రూపాయి డాలర్తో పోలిస్తే 90.14 వద్ద ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!