

ప్రపంచ వాణిజ్య ప్రస్తుత తీరుతెన్నులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్లు, ఇతర మార్గాలను ఆయుధంగా మార్చేశారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటే అదే మనల్ని కాపాడుతుందన్నారు. ఈ మేరకు టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా కాన్క్లేవ్ 2025లో ఆమె మాట్లాడారు.
భారత్ను టారిఫ్ కింగ్ అన్నవారే వాటిని ఆయుధంగా మలుచుకుంటున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. నేరుగా పేరు ప్రస్తావించనప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్పై అమెరికా పెద్దఎత్తున సుంకాలు విధించింది. ఇటీవల మెక్సికో సైతం భారత్పై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కేవలం భారత్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మనకు అదనపు ప్రయోజనం లభిస్తుందని మంత్రి అన్నారు. భారత్ మాత్రం ఏ రోజూ సుంకాలను ఆయుధంగా మలుచుకోవాలని అనుకోలేదని స్పష్టంచేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!