ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మరియు అనంతర పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, అలాగే ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సుమారు 300 పాయింట్లు క్షీణించింది.
ఉదయం 9.25 గంటల సమయానికి సెన్సెక్స్ 1,048.48 పాయింట్లు పడిపోయి 80,238.71 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 307.35 పాయింట్లు దిగజారి 24,871.30 వద్ద కొనసాగింది. రూపాయి మారకం విలువ కూడా బలహీనపడింది. నేటి ట్రేడింగ్లో 24 పైసలు తగ్గి 91.32 వద్ద మారకం జరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ సుమారు 2,700 పాయింట్లు, నిఫ్టీ 530 పాయింట్లు క్షీణించడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. సుమారు రూ.8 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైనట్లు అంచనా. అనంతరం మార్కెట్లు కొంత కోలుకున్నప్పటికీ, నష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 80 డాలర్లకు పైగా ట్రేడవుతున్నాయి. దీనితో దేశీయంగా చమురు ఆధారిత రంగాలకు చెందిన షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్ సుమారు 5 శాతం పడిపోగా, మారుతి సుజుకీ, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రధాన షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక గత ట్రేడింగ్ సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.7,536 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రతికూలంగా ప్రభావితం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!