
న్యూస్

కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ హైయర్ భారత్లో తయారీ విస్తరణకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.7,400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇది భారత్లో హైయర్ చేపట్టనున్న అతిపెద్ద తయారీ విస్తరణ కార్యక్రమంగా భావిస్తున్నారు.
హైయర్ అప్లయెన్సెస్ ఇండియా అధ్యక్షుడు ఎన్ఎస్ సతీష్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2028 నాటికి రూ.22,000 కోట్ల ఆదాయం సాధించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎయిర్ కండీషనర్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్ల ఉత్పత్తిని భారీగా పెంచనుంది. భారత్లో తన మార్కెట్ స్థాయిని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎగుమతులను కూడా విస్తరించాలనే దిశగా హైయర్ ముందుకెళ్తోంది.






.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!