

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబరుతో ముగిసిన మూడవ త్రైమాసికంలో (Q3) భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. మాన్యుఫాక్చరింగ్ మరియు సేవల రంగాల మెరుగైన పనితీరు దీనికి తోడ్పడింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 7.4 శాతం రేటుతో పోలిస్తే వృద్ధి సాధించగా, ఈ ఏడాది Q2లో నమోదైన 8.4 శాతంతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులలో అనిశ్చితులున్నప్పటికీ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.
2022-23 ఆధార సంవత్సరంతో కొత్త జీడీపీ సిరీస్ ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవిక జీడీపీ రూ.322.58 లక్షల కోట్లకు చేరనుందని అంచనా. నామినల్ జీడీపీ రూ.345.47 లక్షల కోట్లకు చేరి 8.6 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. Q3లో రియల్ GVA 7.8 శాతంతో రూ.77.38 లక్షల కోట్లకు, నామినల్ GVA 8.2 శాతంతో రూ.82.58 లక్షల కోట్లకు పెరిగింది.
భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ అంచనా ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7-7.4 శాతం శ్రేణిలో ఉండవచ్చని, నామినల్ జీడీపీ దాదాపు 11 శాతానికి చేరవచ్చని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటవచ్చని, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని కొనసాగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!