

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల లీటర్పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. ఇంధన ధరలు మరింత పెరుగుతాయేమోనన్న భయం వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెంపు భారం ప్రజలపై పడదని, ఆయిల్ కంపెనీలే ఆ వ్యయాన్ని భరిస్తాయని వెల్లడించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే పెరగవని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాహనదారులు ఊరట పొందారు.
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ఇంధన ధరల్లో మార్పులు ఉండొచ్చన్న అంచనాతో వాహనదారులు ఎదురుచూస్తుంటారు. కానీ ఈ నెలలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ధరలు స్థిరంగా కొనసాగడం వినియోగదారులకు కొంతమేర ఉపశమనం కలిగిస్తున్న అంశంగా చెప్పవచ్చు.
ప్రస్తుతానికి అంతర్జాతీయ చమురు ధరలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బట్టి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!