

దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో మార్పులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కొత్త స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు భారీ వేతన ప్యాకేజీలు అందిస్తోంది. ఫ్రెషర్ల కోసం ఎంట్రీ లెవల్ జీతాలను ఏడాదికి గరిష్టంగా రూ.21 లక్షలకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది.
ఇన్ఫోసిస్ ప్రత్యేక టెక్నాలజీ రోల్స్ కోసం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లను తీసుకుంటోంది. ప్రస్తుతం ఇతర ఐటీ కంపెనీలు ఇంతకంటే తక్కువ వేతనాన్ని అందిస్తే, ఇన్ఫోసిస్ అత్యధిక జీతాలను ప్రకటించడం విశేషం. 2025 గ్రాడ్యుయేట్ల కోసం కంపెనీ ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఈ ప్రత్యేక రోల్స్ కోసం అర్హులుగా ఉంటారు. వేతన ప్యాకేజీలు ఏడాదికి రూ.7 లక్షల నుండి రూ.21 లక్షల వరకు ఉంటాయని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 ఫ్రెషర్లను నియమించనుందని ప్రకటించింది. ప్రథమార్థంలో ఇప్పటికే 12,000 మంది నియమితులై ఉండగా, మిగతా నియామకాలు త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొంది.
.png&w=3840&q=75)
















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!