
రాజకీయాలు

ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ యోధ తన ఎల్5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీవీలర్లో లిమిటెడ్ ఎడిషన్ ‘ఈపీవోడీ-భారత్’ మోడల్ను ఆవిష్కరించింది. హస్తకళల వెర్షన్గా రూపొందించిన ఈ మోడల్ను స్వయం ఉపాధి పొందుతున్న డ్రైవర్లు, మొబిలిటీ ఆంత్రప్రెన్యూర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్రారంభ ధరను రూ.3.20 లక్షలుగా నిర్ణయించింది.
ఇదే సందర్భంగా తమ ఉత్పత్తుల విస్తరణపై కూడా యోధ కీలక ప్రకటన చేసింది. ప్యాసింజర్ త్రీవీలర్తో పాటు మరో రెండు సరకు రవాణా త్రీవీలర్లను మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. మొత్తం మూడు కొత్త వాహనాలను పరిచయం చేయడం ద్వారా ప్యాసింజర్, గూడ్స్ మొబిలిటీ విభాగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని యోధ లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!