

యుద్ధ వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. ఈ రోజుల్లో సైనిక వ్యూహాల్లో టెక్నాలజీ కీలక ఆయుధంగా మారుతోంది, మరియు భవిష్యత్ యుద్ధాలు కేవలం మానవుల మధ్య మాత్రమే కాకుండా, మెటల్ వర్సెస్ ఫ్లెష్ (యంత్రాలు vs మనుషులు) రూపంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో భారత దళాలు LAC సమీపంలో చైనాకు చెందిన ‘స్పై రోబోట్’ ను గుర్తించారని పేర్కొంటున్నారు. ఈ వీడియో చైనా-భారత సరిహద్దు వంటి అత్యంత సున్నితమైన ప్రాంతంలో రోబోటిక్ పర్యవేక్షణపై ఆందోళనలు పెంచింది. ఇప్పటికే అనేక దేశాలు తమ సైనిక వ్యూహాల్లో AI, డ్రోన్లు, ఆటోనమస్ వాహనాలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఈ ఘటన భవిష్యత్ యుద్ధానికి సంకేతం కావచ్చు.
ఎత్తైన ప్రాంతంలో షూట్ చేసిన ఈ వీడియోలో ఒంటరిగా నిలబడిన హ్యూమనాయిడ్ రోబో ఆకారం కనిపిస్తుంది. ఇది చైనా సరిహద్దు భద్రతలో భాగమని కొందరు సూచిస్తున్నారు. వీడియో చూసిన చాలా మంది దీన్ని భారత దళాల కదలికలను ట్రాక్ చేసే ఫంక్షనల్ రోబోట్ అని భావిస్తున్నారు, కానీ అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

సోషల్ మీడియా స్పందన
ఎక్స్ (మునుపు ట్విట్టర్) వేదికపై వీడియోకి లక్షల వ్యూస్, లైక్స్ మరియు వేల రీపోస్ట్లు వచ్చాయి. కొందరు నెటిజన్లు సరదాగా “టెర్మినేటర్ 1.0 చైనా సరిహద్దులో” అని కామెంట్ చేశారు, మరికొందరు “మోదీగారు చిట్టి 2.0 పంపండి” అని వ్యాఖ్యానించారు.
చైనా రోబోటిక్ యుద్ధ వ్యూహం
వైరల్ క్లిప్ అధునాతన సైనిక సాంకేతికత కారణంగా భారీగా హైప్ అయింది. చైనా వేగంగా AI ఆధారిత ఆటోనమస్ నిఘా వ్యవస్థలు మరియు హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగాల్లో పురోగతి సాధిస్తోంది. ఈ పరిణామాలు రోబో ఆధారిత నిఘా వ్యవస్థల వినియోగంపై తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మానవ గస్తీపై ఆధారాన్ని తగ్గించి, సరిహద్దు ప్రాంతాల్లో పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు చైనా ఈ సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. టిబెట్లో రోబో డాగ్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా, చైనా తైవాన్ సరిహద్దు ప్రాంతంలో కూడా రోబోటిక్ సైనికులను మోహరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పరిణామం భారత్–చైనా సరిహద్దులో కూడా ఇలాంటి వ్యవస్థలు ప్రత్యక్షం కావొచ్చన్న ఆందోళనలను పెంచుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!