

కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టు (Team India) వన్డే వరల్డ్ కప్పు ను (ICC Womens ODI World Cup) కైవసం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ 25 నుంచి 100 శాతం వరకు అమాంతం పెరిగింది. అలాగే హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ తదితరుల సోషల్ మీడియా అకౌంట్లకు ఒక్కసారిగా ఫాలోవర్లూ పెరిగారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసి 24 గంటలు కాకముందే.. క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. కొత్త ఎండార్స్మెంట్లే కాకుండా.. పాత వాటి పెంపు విషయమై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues).. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 127 పరుగులతో (134 బంతుల్లో, 14 ఫోర్లతో) నాటౌట్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె బ్రాండ్ వాల్యూ 100 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. జెమీమా బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజు.. రూ.75 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె.. రెడ్ బుల్, బోట్, సర్ఫ్క్స్లు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.
దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana). ఇప్పటికే ఆమె.. రెక్సోనా డియోడ్రెంట్, నైక్, హ్యుందాయ్, హెర్బాలైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గల్ఫ్ ఆయిల్, పీఎన్బీ (PNB) మెట్లైఫ్ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది. వీటి ద్వారా ఆమె ఒక్కో బ్రాండ్కు రూ.1.5 నుంచి 2 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వరల్డ్ కప్ విజయంతో కొన్ని గంటల్లోనే టీమ్ ఇండియా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది.











కామెంట్స్ (2)
చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు!
Wow! Women cricketers are smashing it both on and off the field!