
సినిమాలు

టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవడంతో ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వేగవంతమైన బౌలర్ షోయబ్ అక్తర్ పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. క్రికెట్పై సరైన అవగాహన లేని వ్యక్తి పీసీబీ చైర్మన్ అయ్యారని మండిపడుతూ, జట్టు ఎలా నడుస్తుందో మీకు తెలుసా అని ప్రశ్నించాడు.
అంతేకాదు, ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేని బాబర్ ఆజమ్ ను మీరు సూపర్ స్టార్ చేశారని అక్తర్ ధ్వజమెత్తాడు. వరుస వైఫల్యాలకు బాధ్యత వహించే వ్యవస్థ లేకపోవడమే పాక్ క్రికెట్ పతనానికి కారణమని వ్యాఖ్యానించాడు. జట్టు ఎంపిక నుంచి నిర్వహణ వరకు అన్నీ లోపాలేంటని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ను ఆయన తీవ్రంగా విమర్శించాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!