
జనరల్

దాదాపు 43 నిమిషాల పాటు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 10 పీవీ సింధు జపాన్ స్టార్ అకానే యమగూచి చేతిలో 20–22, 12–21 తేడాతో వరుస గేమ్స్లో ఓడిపోయింది. మొదటి గేమ్లో సింధు మంచి ఆరంభం చేసి మిడ్-గేమ్ వరకు ఆధిక్యంలో ఉంది. 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ను కూడా సేవ్ చేసినా చివర్లో గేమ్ను కోల్పోయింది.
రెండో గేమ్లో యమగూచి పూర్తిగా ఆధిపత్యం చూపించింది. ప్రారంభంలోనే 7 పాయింట్ల ఆధిక్యం సాధించి మ్యాచ్ను సులభంగా గెలుచుకుంది. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ జట్టు ముందే రిటైర్ అవ్వగా, సింగిల్స్లో ఏ భారత ఆటగాడు కూడా మొదటి రౌండ్ దాటలేకపోయాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!