
క్రీడలు

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఉన్న ప్రత్యేక గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతానికి ‘గణేష్పురి’గా పేరు పెట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ముంబైలోని లాల్బాగ్చా రాజా తర్వాత ప్రముఖ గణేశుడిగా పేరొందినట్లు ఆయన పేర్కొన్నారు.
చారిత్రకంగా కొనసాగుతున్న ప్రాంతాల పేర్లలో మార్పులు చేసి, మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లను పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని రాజాసింగ్ అన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ పేరును ‘గణేష్పురి’గా మార్చే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!