
క్రీడలు

మాజీ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఆటగాళ్ల ఎంపికలో పక్షపాతం, గుత్తాధిపత్యం, దీర్ఘకాలిక ప్రణాళికల లోపం ఉన్నాయని ఆమె ఆరోపించారు. తాను చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని తన అకాడమీకి సంబంధించి కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 కోర్టులతో స్వయంగా నిర్మించిన అకాడమీ ఉన్నప్పటికీ అధికారుల నుంచి మద్దతు లభించడం లేదని తెలిపారు. అండర్-13, అండర్-15 క్రీడాకారులను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నా తనపై తప్పు ముద్ర వేస్తున్నారని ఆమె విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!