
సినిమాలు

పంజాబ్కు చెందిన స్ప్రింటర్ గురీందర్వీర్ సింగ్ భారత అథ్లెటిక్స్లో కొత్త చరిత్ర సృష్టించారు. రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్లో వంద మీటర్ల పరుగును పది దశాంశం సున్నా తొమ్మిది సెకన్లలో పూర్తి చేసి భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్గా నిలిచారు. అంతేకాకుండా పది దశాంశం పది సెకన్ల అవరోధాన్ని దాటిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.
గురిందర్వీర్ సింగ్ ప్రదర్శనపై క్రీడా ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. భారతదేశంలో క్రికెట్కు ఎక్కువ ఆదరణ ఉన్నప్పటికీ, ఇలాంటి అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ రికార్డు సాధించిన ఉసేన్ బోల్ట్ సమయానికి కేవలం సున్నా దశాంశం యాభై ఒక సెకన్ల తేడాతో గురీందర్వీర్ నిలవడం భారత అథ్లెటిక్స్కు గొప్ప ఘట్టంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!