

ఆంధ్రప్రదేశ్ను ఇటీవల ముంచెత్తిన మొంథా తుఫాను రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టాలకు దారితీసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత వెల్లడించారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో వారు సమావేశమై తుఫాను ప్రభావం పై సమగ్ర నివేదికను సమర్పించారు.
మంత్రుల వివరాల ప్రకారం, తుఫాను ధాటికి మొత్తం రూ.6,352 కోట్ల నష్టం నమోదైంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు మాత్రమే కాదు, పలు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 28 రాత్రి కాకినాడ తీరానికి సమీపంలో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలతో తుఫాను దూసుకొచ్చింది.
ఈ ప్రళయాకర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించింది. శిబిరాల్లో ఆహారం, తాగునీరు, పాలు, అవసరమైన సరుకు వెంటనే అందించబడింది. ప్రతి ప్రభావిత కుటుంబానికి రూ.3,000 తక్షణ సాయం అందించారు.
తుఫాను తర్వాత చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస ఏర్పాట్లు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి చర్యలను వేగంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తక్షణ సహాయం కోసం రూ.60 కోట్లు విడుదల చేశారు.
నష్టం విభాగాలవారీగా ఇలా ఉంది:
వ్యవసాయ, అనుబంధ రంగాలు: రూ.271 కోట్లు
గృహ నష్టం: రూ.7 కోట్లు
రహదారులు, మౌలిక వసతులు: రూ.4,324 కోట్లు
విద్యుత్ రంగం: రూ.41 కోట్లు
నీటి వనరులు, నీటిపారుదల: రూ.369 కోట్లు
శాశ్వత నిర్మాణాలు: రూ.1,302 కోట్లు
సామూహిక ఆస్తులు: రూ.48 కోట్లు
మొత్తం రూ.6,356 కోట్ల నష్టాల్లో, NDRF నిబంధనల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమన పునరుద్ధరణకు కేటాయించ వచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.. ఈనెల 12 న సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్ర IMCT బృందం స్థల పరిశీలన కూడా పూర్తి చేసినట్టు తెలిపారు. అమిత్ షా ను కలిసిన వారిలో హోంమంత్రి అనితతో పాటు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!