
రాజకీయాలు

సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రజలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకం అమలుకు సుమారు రూ.25,530 కోట్ల వ్యయం చేయనున్నట్లు వెల్లడించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి రేషన్ సరఫరా కొనసాగించనుంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆహార భద్రత అందించడంతో పాటు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!