
రాజకీయాలు

దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎన్. హనుమంతరావు ఈరోజు లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. రాబోయే సరస్వతి అంత్య పుష్కరాలకు ఆయనను అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలు (జూన్ 26 నుంచి జూలై 7, 2027 వరకు), సరస్వతి అంత్య పుష్కరాలు (మే 21 నుంచి జూన్ 1, 2026 వరకు) నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్ల పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ను గవర్నర్కు వివరించారు.
పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్య కార్యదర్శి తెలిపారు. భక్తుల వసతి సదుపాయాలు, రద్దీ నియంత్రణ చర్యలు, ముఖ్య ఆలయాల ప్రాధాన్యత, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాల పై గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!