
గాసిప్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.54 శాతం ఓటింగ్ నమోదైంది అని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తదుపరి పోలింగ్ శాతం వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్లలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా 53.48 శాతం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కనిష్టంగా 35.49 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 40.96 శాతం ఓటింగ్ జరిగింది. అలాగే 116 మున్సిపాలిటీల్లో సగటు పోలింగ్ 51.6 శాతంగా నమోదైంది. మున్సిపాలిటీ స్థాయిలో ఆలంపూర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా 68.57 శాతం, నిర్మల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 33.73 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!