

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఐసీసీ తరపున తెలంగాణ నుంచి నలుగురు నేతలను ఎంపిక చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ విప్ డాక్టర్ బలమూరి వెంకట్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లకు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది.
నిన్న త్రివేంద్రంలోని కేరళ పీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నేతలతో సమావేశం అయ్యారు. ఏప్రిల్ 7 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎర్నాకులం, త్రిశూర్ జిల్లాలకు శ్రీధర్ బాబు ఇంచార్జీగా, కల్లియస్సేరి నియోజకవర్గానికి హర్కర వేణుగోపాల్ రావు, కొల్లాం నియోజకవర్గానికి పద్మావతి రెడ్డి, దేవికులం నియోజకవర్గానికి డాక్టర్ బలమూరి వెంకట్ ఇంచార్జులుగా నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు దీపా దాస్ మున్షీ, కేరళ పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్లను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.










.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!