
గాసిప్స్

మంత్రి లోకేష్పై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని జోగి రమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడమే కాకుండా, నిప్పు పెట్టినట్లు సమాచారం. ఘటన సమయంలో జోగి రమేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్పందించిన జోగి రమేష్, తాను ఏ తప్పు చేశానని తన ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయడం, అసాంఘిక శక్తులను దాడికి పంపడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. అధికారంలో శాశ్వతంగా ఉంటామనే భ్రమతో ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదని, ఇటువంటి క్షణిక ఆనందాల కోసం హింసకు దిగడం మానుకోవాలని జోగి రమేష్ హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!