

సస్పెండ్ అయిన భారత జాతీయ కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. భారత్–అమెరికా ట్రేడ్ డీల్పై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రాజీపడ్డారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న లోక్సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే అనురాగ్ ఠాగూర్, నిశికాంత్ దూబే వంటి బీజేపీ నేతలు అడ్డు తగిలారని, స్పీకర్ మైక్ను వేరే వారికి ఇవ్వడంతో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అడ్డుకుంటూ, ఎంపీల నోరును నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు తమను గెలిపించింది పార్లమెంట్లో ప్రజా సమస్యలను లేవనెత్తేందుకేనని ఆయన స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!