

దేశ అభివృద్ధికి రాబోయే బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ సిద్ధం చేస్తున్నామని, 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని అన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన సూచనలు ప్రతి సభ్యుడు గౌరవంగా పరిగణనలోకి తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండటం భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవమని మోదీ అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని, భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని, ఉత్పత్తి రంగానికి మరింత ఊపునిస్తుందని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!