
జనరల్

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలిసి శాసన సభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఈ భేటీ పార్టీ అంతర్గత పరిణామాలకు ప్రాధాన్యతను తీసుకువచ్చింది.
మరోవైపు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పవన్ కళ్యాణ్ సమావేశమై ఆయన పనితీరును సమీక్షించారు. నియోజకవర్గానికి సంబంధించిన ఆరోపణలపై వివరణ కోరగా, వ్యక్తిగత విషయాలను సరిచేసుకునేందుకు గడువు ఇవ్వాలని బాలరాజు అభ్యర్థించారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ నాలుగు వారాల గడువు ఇచ్చారు. అలాగే రూ.147 కోట్ల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!