

బీహార్ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఈ రోజు జనతాదళ్ యునైటెడ్ పార్టీలో అధికారికంగా చేరారు. పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నలభై ఏళ్ల ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నిశాంత్ను కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లలన్ మరియు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా సహా పలువురు నాయకులు ఆహ్వానించారు. ఈ పరిణామాన్ని పార్టీ నాయకత్వంలో తరాల మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
ఇటీవల నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో నిశాంత్ కుమార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు ఆయనకు సన్నిహితులు వెల్లడించారు. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్ నాయకత్వంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!