
గాసిప్స్

లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి భద్రతా ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో సభను వాయిదా వేశారు. పార్లమెంటు వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్కు చెందిన కొంతమంది సభ్యులు సభలో మోదీని చుట్టుముట్టే ప్రయత్నం చేయవచ్చనే సమాచారం రావడంతో జాగ్రత్త చర్యగా సభను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఈ అనూహ్య పరిణామం కారణంగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం జరగలేదు. అయితే లోక్సభ గురువారం ఆయన ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఇలాంటి కీలక సందర్భంలో ప్రధాని ప్రసంగం లేకపోవడం అరుదైన పరిణామంగా రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!