
.webp&w=3840&q=75)
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సోమవారం కీలక టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ ఒక భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్–అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నారు. ప్రతిగా, అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు మరియు ఇతర అడ్డంకులను తొలగించేందుకు అంగీకరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, భారత్ ఇకపై రష్యా చమురు కొనుగోలు నిలిపివేసి అమెరికా మరియు వెనిజులా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో, సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు కొనుగోళ్లకు భారత్ సన్నద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!