
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ 293 స్థానాల్లో 190 చోట్ల ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరిట ఓట్లలో అక్రమాలు జరిగాయని ఆమె పేర్కొన్నారు.
పార్టీ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలను విడిచిపెట్టవద్దని సూచించిన మమత, ప్రారంభ రౌండ్లలో బీజేపీకి అనుకూలంగా ఆధిక్యాన్ని చూపిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తున్నారని, కొన్ని చోట్ల కౌంటింగ్ను ఆపేశారని తెలిపారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ 97 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. అయినప్పటికీ తుది ఫలితాల్లో తమదే విజయం అని మమత ధీమా వ్యక్తం చేశారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!