

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంతో పాటు ఆ గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు రూ.900 కోట్లతో పనులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆరు నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, అధైర్యపడవద్దని రైతులకు ధైర్యం చెప్పారు.
రాజధాని గ్రామాల్లో ఒకటైన ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామ సభలో పాల్గొన్న ఆయనకు రైతులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థుల అభిప్రాయాలను తీసుకుంటూ రాజధాని ప్రాంత గ్రామాల అభివృద్ధిపై చర్చించారు.
కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ మరోసారి ధృవీకరించారు. గ్రామస్థులు కోరిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో వివరంగా తెలియజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!