
సినిమాలు

మాసాబ్ ట్యాంక్లో ఇటీవల దారుణ హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ నివాసాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఆయన అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, తలసాని సాయికిరణ్ యాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సమాజంలో శాంతిభద్రతలకు కీలకమైన న్యాయవాదిని హత్య చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు వెంటనే విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేయాలని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ వారి వెంట ఉంటుందని స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!