
క్రీడలు

ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత హైదరాబాద్ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి, రోడ్డుపై వడ్లు, ధాన్యం పారబోసి నిరసన తెలిపారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, తరుగు తీయకూడదని డిమాండ్ చేశారు.
ఈ నిరసన సమయంలో కవితతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ధాన్యం, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటల కొనుగోళ్లలో ఆలస్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మరణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపించాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!