

కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పీవోకే అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమని ప్రకటించారు. గత ఏడాది మే నెలలో భారత్–పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం దౌత్యపరంగా మళ్లీ ముందుకు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా భారత్ పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు.
‘‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమే జమ్మూకశ్మీర్ సమస్యకు సరైన పరిష్కారం’’ అని షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని చెబుతూ, జిన్నా కాలం నుంచే కశ్మీర్ పాకిస్థాన్ జీవనాడిగా విదేశాంగ విధానానికి కేంద్రబిందువుగా ఉందన్నారు. ఈ సందర్భంగా హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ, వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ పేర్లను ప్రస్తావించడం గమనార్హంగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!