జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యకర్తల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
మొదటిగా ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో పిఠాపురంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేసి, వాటిని స్థానిక స్థాయిలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

దీంతో జిల్లా, నగర, మండల కేంద్రాల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ నెల 14న తమ తమ ప్రాంతాల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి పార్టీ ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!