
సినిమాలు

హర్మూజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ ఐరాస వేదికగా తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో సముద్ర భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్. వాణిజ్య నౌకలు మరియు సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసే కుట్రలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ఐరాసలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!