

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చట్టంపై గౌరవంతో, తన కుమారుడిని అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించినట్లు ఆయన తెలిపారు. చట్టం ముందు తన బిడ్డైనా, సామాన్యుడైనా సమానమేనని స్పష్టం చేశారు. “సత్యమేవ జయతే” అనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు.
తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని బండి సంజయ్ తెలిపారు. కేసు నమోదైన వెంటనే అప్పగించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, లాయర్ల సలహా మేరకు ఆధారాలు సమర్పించిన తర్వాత కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ఆధారాలు పరిశీలిస్తే కేసు కొట్టేస్తారని, బెయిల్ కూడా వస్తుందని న్యాయవాదులు చెప్పినట్లు వెల్లడించారు.
ఇంకా ఆలస్యం చేయడం సరికాదని భావించి తన కుమారుడిని పోలీసుల విచారణకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కోర్టు నిర్ణయం సోమవారం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, చట్టాన్ని గౌరవిస్తూ ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!