

మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన అనంతరం తన రాజకీయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను అన్యాయంగా జైలులో పెట్టారని ఆరోపించారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని, ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయనని పేర్కొన్నారు. 18 రోజుల జైలు జీవితం కఠినంగా ఉన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపారు.
అంబటి విడుదల సందర్భంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. బారికేడ్లు తొక్కుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ‘జై జగన్’ నినాదాలతో పార్టీ జెండాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆయన వాహనాన్ని అనుసరించడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసానికి చేరుకున్న అంబటి రాత్రి అక్కడే బస చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!