
ఓటీటీ

బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 9 గంటల నుంచి తొలి ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య గట్టి పోటీ నెలకొంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!