
గాసిప్స్

వ్యక్తిత్వ హక్కులను రక్షించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ హైకోర్టు శరణు చేరారు. సోషల్ మీడియా వేదికల్లో తన ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగిస్తూ వస్తున్న నేపథ్యంలో, ఇలాంటి దుర్వినియోగం పై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరినట్లు తెలిసింది. ఇటీవలే సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున కూడా ఇలాంటి ఉల్లంఘనల నుంచి రక్షణ పొందేందుకు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో న్యాయపరంగా రక్షణ కోరడం గమనార్హం. బాలీవుడ్లో ఇప్పటికే సెలబ్రిటీల చిత్రాలు, వ్యక్తిగత సమాచారం అనధికారికంగా ప్రచారం అవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన కొద్దీ, తమ హక్కులను కాపాడుకునేందుకు సినీ నటులు, ప్రజాప్రతినిధులు న్యాయ మార్గాన్ని ఆశ్రయించడం పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!