
గాసిప్స్

మోదీతో చంద్రబాబు, జగన్లకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ కూడా మోదీకి దగ్గరగా ఉంటారని జగ్గారెడ్డి అన్నారు. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారో వారు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఏపీలో ప్రభుత్వాలు మారినా ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. మాట మార్చిన చంద్రబాబు, జగన్కు మాట్లాడే అర్హత లేదన్నారు.
తనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ముఖ్యమేనని తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎంలు పరస్పరం ప్రాజెక్టులపై చర్చలు జరుపుకోవాలని సూచించారు. గతంలో జగన్, కేసీఆర్లు ప్రాజెక్టులపై చర్చలు చేశారా అని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!