
సినిమాలు

తిరుపతిలో నేడు ‘రా ఎన్టీఆర్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ‘ఊరు వాడ’ పేరుతో రూ.100 కోట్ల ప్రజాసేవ కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా నిర్వాహకులు వివరాలు వెల్లడించనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని సాయి రూప్ ఈ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇక ఈ కార్యక్రమానికి తమకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. రెండు వర్గాల అభిమానుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో తిరుపతి పోలీసులు స్టార్ హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!